ముంబైలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక ముంబైనగరంలో పలు చోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై భారీగా నిలిచిన వరద నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వాహనదారులు ఎవరూ ముంపు ప్రాంతాలవైపు రావద్దని బీఎంసీ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని బీఎంసీ అధికారులు కోరారు.