తెలంగాణలో కొత్తగా 1597 కేసులు

Update: 2020-07-16 08:19 GMT

తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1597 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని బాధితుల సంఖ్య 39,343కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 25,999 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 12,958 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ ఈ మహమ్మారి 386 మందిని బలితీసుకుంది.

Similar News