తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే 1430 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 703 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47,705 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. కరోనా మమమ్మారి బారిన పడి ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 429కి చేరింది. రాష్ర్టంలో కరోనా బారిన నుంచి కోలుకుని 36,385 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 10,891మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.