ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగ్స్, తుపాకులు, బాంబుల తయారీకి వినియోగించే సామాగ్రితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.