సింగపూర్లో భారత సంతతికి చెందిన నర్సుకు అరుదైన గౌరవం లభించింది. 59 ఏళ్ల కళా నారాయణస్వామి సింగపూర్లో నర్సుగా పనిచేస్తోంది. భారత సంతతికి చెందిన కళా నారాయణస్వామి.. ప్రతిష్ఠాత్మక సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు దేశ ఆరోగ్య శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్-19 సోకిన రోగులకు చేసిన సేవలకు గానూ ఈ అవార్డు ఆమెను వరించింది. పురస్కారంలో భాగంగా ట్రోఫీ, సర్టిఫికేట్తో పాటు 10 వేల సింగపూర్ డాలర్లను ఇవ్వనున్నారు.