కరోనా వారియర్స్ ఎవరైనా కరోనాతో మృతిచెందితే కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా సోకి మృతి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి సీఎం సంతాపం తెలియజేశారు. తరువాత ప్రభుత్వం ఆకుటుంబానికి అండగా ఉంటుందన్న ఆయన కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అమిత్ జీ తన జీవితాన్ని లెక్క చేయకుండా ఢిల్లీ ప్రజల కోసం కరోనాతో పోరాటాం చేశాడని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు కోల్పోయాడని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల తరుపున ఆయనకు నివాళిఅర్పిస్తున్నారని అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఆయన కుటుంబానికి కోటిరూపాయల ఆర్థికసాయం అందిస్తామని.. కరోనాపై ఫ్రంట్లైన్లో ఉండి పోరాటం చేస్తున్న వారందరికీ ఎక్స్గ్రేషియో వర్తిస్తుందని అన్నారు.