కరోనా : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ప్రజల ఆగ్రహం

Update: 2020-07-26 17:15 GMT

ఇజ్రాయెల్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ సోకిన వారి సంఖ్య 60 వేలు దాటింది. అయితెహ్ పెరుగుతున్న కేసుల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కరోనా కట్టడిచేయడంలో విఫలం అయినందున ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం

జెరూసలేంతో సహా దేశంలోని పలు నగరాల్లో ప్రజలు ప్రదర్శనలు ఇచ్చారు. కరోనాను ఆపడంలో

మొదటినుంచి కూడా నెతన్యాహు విఫలమయ్యారని నిరసనకారులు తెలిపారు. కాగా గత వారం నుండి ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు వ్యతిరేకంగా మూడు ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో కరోనాకు సంబంధించిన పనులలో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Similar News