మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కరోనా వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా దక్షిణ కొరియాలోని ఫార్మా కంపెనీలో 20 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తామని అన్నారు. ఈ మేరకు ఆయన సౌత్ కొరియా దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్కు ఓ లేఖ కూడా రాశారు. ఎస్కే బయోసైన్స్ అనే ఫార్మా కంపెనీలో ఈ వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తామని గేట్స్ పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఈ ఏడాది మేలో మాట్లాడుతూ.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 3.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం తమకు అందిందినని తెలిపారు.