టిక్టాక్ మాతృసంస్థ బైట్డాన్స్కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. టిక్టాక్ ను పలు దేశాలు, యూజర్లు నిషేధించడమే కాకుండా.. మాతృసంస్థ నుంచి పలువురు ఉద్యోగులు కూడా వైదొలుగుతున్నారు. వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం కలుగుతుందని భారత్ ఇటీవల టిక్టాక్ను నిషేధించిన విషయం తెలిసిందే. భారత్ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ నిషేధించడంతో బైట్డాన్స్కు చాలా నష్టాన్ని చవిచూసింది. తాజాగా సంస్థ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటల్లిజెన్స్) ల్యాబ్ హెడ్ వెయ్-ఇంగ్ మా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వెయ్-ఇంగ్ 2017లో మైక్రోసాఫ్ట్ నుంచి బైట్డాన్స్కు వచ్చారు. ఈ సంస్థకు వచ్చిన తరువాత పలు స్థాయిల్లో ఉద్యోగం చేసిన ఆయన తాజాగా వైదొలిగినట్టు తెలుస్తుంది.