చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి ముప్పుతిప్పలు పెడుతున్న కరోనాని చైనా అతికొద్ది కాలంలోనే నియంత్రణ చేయగలిగింది. వైరస్ ని పూర్తి స్థాయిలో నియంత్రించగలిగామని భావిస్తున్న తరుణంలో చైనీయులను మళ్లీ కలవరానికి గురిచేస్తోంది కొవిడ్ మహమ్మారి. శుక్రవారం దేశ వ్యాప్తంగా 127 కరోనా కేసులు బయటపడినట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 5 తరువాత పెద్ద మొత్తంలో నమోదైన కేసుల సంఖ్య ఇదే. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారు దేశం మొత్తం మీద 84,292 కాగా, 4,634 మంది మరణించారు.