ప్రధాని నరేంద్ర మోదికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. సుమారు 4,000 మంది కమాండో శిక్షణ పొందిన సిబ్బందితో ఉన్న ఉన్నత సంస్థ క్రమంగా తన సిబ్బందిని మాతృ సంస్థలకు మార్చాలని.. వారి సేవలను వివిధ అంతర్గత భద్రతా విధుల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు భద్రతా సంస్థలోని ఉన్నతాధికారులు పిటిఐకి తెలిపారు.
ఇందులో ఈ జాబితాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి కనీసం 86 మంది అధికారులు,
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 45, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 23, సాశాస్త్రా సీమా బాల్ నుండి 24, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులకు చెందిన 17 మంది అలాగే మరికొందరు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని అధికారులు చెప్పారు.