సీఎం రమేశ్ కు కరోనా..

Update: 2020-08-07 15:39 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ వచ్చిందని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. రమేష్ కు కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, రాజకీయనాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

Similar News