గత నెల 11వ తారీఖున కరోనా భారిన పడిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు కోలుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా మారిన ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నీ స్వయంగా అభిషేక్ బచ్చనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్! ఈ రోజు మధ్యాహ్నం చేసిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది.
నేను కరోనాను జయిస్తానని చెప్పినట్టుగానే జయించాను. ఇది అందరి ప్రార్థనలతోనే సాధ్యమైంది' అంటూ ట్వీట్ లో అభిషేక్ పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు ఇద్దరికి ఒకేసారి కరోనా నిర్ధారణ అయింది. దాదాపు నాలుగు వారాల పాటు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.