బ్రెజిల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 24 వేల 48 కొత్త కేసులు నమోదయ్యాయి.. అలాగే 703 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య 30 లక్షల 57 వేల 470 కు చేరుకుంది. మృతుల సంఖ్య 1 లక్ష 1 వేల 752 కు పెరిగింది. మొదటి మూడు నెలల్లో 50 వేల మరణాలు సంభవిస్తే, మిగతా లక్ష మరణాలు కేవలం 50 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. అయినప్పటికీ, దేశంలో దుకాణాలు, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతిచ్చారు.