మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Update: 2020-08-14 08:48 GMT

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జబల్ పూర్-నాగపూర్ జాతీయ రహదారిపై బియ్యం, బత్తాయి లోడుతో వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

Similar News