పడవ మునిగి నలుగురు మత్స్యకారులు గల్లంతు

Update: 2020-08-17 08:41 GMT

కర్నాటకలో చేపల వేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మంగళూరు సమీపంలో కొడేరి గ్రామ సమీపంలో అరేబియా సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉడుపి జిల్లా బైందూర్ తాలూకా కొడేరి గ్రామ ఫిషింగ్ హార్బరు వద్ద రెండు పడవల్లో 24 మంది మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే, సముద్రంలో అలలు తాకిడి వలన పడవ మునిగింది. ఈ పడవలో 12 మంది ఉండగా.. అందులో 8మంది ఈత కొట్టుకుంటూ.. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్తా సెక్యూరిటీ పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టారు.