ఏపీలో కరోనా విజ‌ృంభణ.. 3లక్షలకు చేరువలో కేసులు

Update: 2020-08-16 21:54 GMT

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజు భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,012 మందికి కరోనా సోకిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య2,89,829కి చేరింది. అటు, మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మరణించారు. దీంతో, మొత్తం మరణాల సంఖ్య 2,650కి చేరింది. అయితే, ఇటీవల ఏపీలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది. కూడా కాగా, ఇప్పటివరకూ 20,1234 మంది కరోనాతో కోలుకోగా.. 85,945 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News