ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు!
ఏపీలో గడిచిన 24 గంటల్లో 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 139 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 8,86,557కి చేరుకుంది.;
ఏపీలో గడిచిన 24 గంటల్లో 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 139 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 8,86,557కి చేరుకుంది. ఇందులో 1,552 యాక్టివ్ కేసులున్నాయి. కోలుకున్న వారి సంఖ్య 8,77,893కి చేరింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,142 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,39,648 కరోనా సాంపుల్స్ని పరీక్షించింది ప్రభుత్వం.