పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Update: 2021-01-07 09:24 GMT

పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలో రామతీర్థంలో భాగంగా బీజేపీ నేతలు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీనితో కాస్త అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు హెచ్చరించారు.

Tags:    

Similar News