SANKRANTHI: మొదలైన సంక్రాంతి సందడి

కిటకిటలాడుతున్న బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు... హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల క్యూ

Update: 2026-01-11 04:00 GMT

సంక్రాంతి పండుగ రాగానే నగరం ఖాళీ అవుతోంది. కుటుంబాలతో కలిసి పల్లెలకు చేరుకోవాలనే ఆత్రంతో భాగ్యనగర వాసులు భారీగా సొంతూళ్ల బాట పట్టారు. పిల్లలకు పండుగ సెలవులు, ఉద్యోగులకు వరుసగా వచ్చిన వారాంతపు సెలవులు కలిసి రావడంతో శుక్రవారం ఉదయం నుంచే ప్రయాణాల జోరు మొదలైంది. ఫలితంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, వరంగల్ వైపు వెళ్లే వాహనాలతో రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారులపై వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. శుక్ర, శనివారాల్లో సుమారు మూడు లక్షల మంది నగరాన్ని విడిచి పల్లెలకు వెళ్లినట్లు పోలీసుల అంచనా.  బస్సుల సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీసీ ‘గమ్యం’ యాప్‌ను లక్షలాది మంది వినియోగించారు. అయితే సంక్రాంతి వంటి కీలక సమయంలో యాప్ మొరాయించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా ‘నో సిటీ సర్వీస్’ అనే ఎర్రర్ రావడంతో బస్సుల వివరాలు తెలియక ఇబ్బందులు పడ్డామని పలువురు వాపోయారు.

డ్రోన్లతో పర్యవేక్షణ

సం­క్రాం­తి పండగ నే­ప­థ్యం­లో సొం­తూ­ళ్ల­కు వె­ళ్లే ప్ర­జ­ల­తో హై­ద­రా­బా­ద్-వి­జ­య­వాడ జా­తీయ రహ­దా­రి­పై భా­రీ­గా వా­హ­నాల రద్దీ నె­ల­కొం­ది. రహ­దా­రి­పై ట్రా­ఫి­క్‌ సమ­స్య­లు తలె­త్త­కుం­డా ఎక్క­డి­క­క్కడ పో­లీ­సు­లు తగిన చర్య­లు చే­ప­ట్టా­రు. అం­దు­లో భా­గం­గా సూ­ర్యా­పేట వద్ద పో­లీ­సు­లు డ్రో­న్‌ కె­మె­రా­ల­తో హై­వే­పై ట్రా­ఫి­క్‌­ను పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. వా­హ­నా­లు క్రమ పద్ధ­తి­లో వె­ళ్లే­లా చూ­స్తు­న్నా­రు. ఎక్క­డై­నా అవాం­త­రా­లు ఏర్ప­డి­తే.. వెం­ట­నే ట్రా­ఫి­క్‌­ను ని­యం­త్రిం­చేం­దు­కు పో­లీ­సు­లు సి­ద్ధం­గా ఉన్నా­రు. 

ట్రాఫిక్ క్లియ‌ర్ చేసిన సినీ నిర్మాత‌

నం­ది­గామ వద్ద భా­రీ­గా ని­లి­చి­పో­యిన ట్రా­ఫి­క్‌­ను సినీ ని­ర్మాత దగ్గు­బా­టి సు­రే­శ్ బాబు స్వ­యం­గా క్ర­మ­బ­ద్ధీ­క­రిం­చా­రు. హై­ద­రా­బా­ద్ నుం­చి వి­జ­య­వాడ వె­ళ్తుం­డ­గా ఈ అం­త­రా­యం కల­గ­డం­తో, ఆయన స్వ­యం­గా రం­గం­లో­కి దిగి వా­హ­నా­ల­ను క్లి­య­ర్ చే­శా­రు. సం­క్రాం­తి రద్దీ దృ­ష్ట్యా రో­డ్డు మర­మ్మ­తు­లు వే­గం­గా పూ­ర్తి చే­యా­ల­ని సూ­చిం­చా­రు. సరైన ఏర్పా­ట్లు లే­క­పో­వ­డం వల్ల ఆరు గంటల ప్ర­యా­ణం కా­స్తా చాలా ఆల­స్య­మైం­ద­ని అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. పం­తం­గి టోల్ ప్లా­జా వద్ద ఏటా కి­లో­మీ­ట­ర్ల మేర ని­లి­చి­పో­యే ట్రా­ఫి­క్ కష్టా­ల­కు చెక్ పె­ట్టేం­దు­కు ఒక నూతన టె­క్నా­ల­జీ­ని ప్ర­యో­గా­త్మ­కం­గా అమలు చే­స్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్లాట్‌ఫాంలపై పర్యవేక్షణ పెంచి, ప్రయాణికులను క్రమబద్ధంగా రైళ్లలోకి పంపించారు. అదనపు సిబ్బందిని నియమించి, భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News