ఉస్మానియా ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులు కలకలం సృష్టిస్తున్నాయి. ఐసోలేషన్ వార్డులో 55 ఏళ్ల రోగికి 2023 మే 31 వ తేదీతో.. గడువు ముగిసిన డాక్సీ సైక్లిన్-100 ఎంజీ టాబ్లెట్ ఇచ్చారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు... కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. జనవరిలో డాక్స్ ఇండెంట్ వచ్చిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్. గడువు ముగిసిన ఔషధం రోగిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కలిగించదని.. అయినా...సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటున్న సూపరిండెంట్ నాగేందర్.