సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం కోర్టు. పిటిషన్ విచారించేలా హైకోర్టు బెంచ్ ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించాలని కోరారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.  25న హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాష్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని పేర్కొంది.  అంత‌వ‌ర‌కూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా సిబిఐకి అదేశాలు ఇవ్వ‌డానికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

Update: 2023-05-23 07:27 GMT

Linked news