కర్నూలులో హై టెన్షన్.. అవినాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం
కర్నూలులో హై టెన్షన్ నెలకొంది.ఎంపీ అవినాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసింది సీబీఐ. తెల్లవారు జామునే కర్నూలుకు చేరుఉన్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీకి సమాచారం అందిచారు. విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్న వార్తల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి అవినాష్ అనుచరులు భారీగా చేరుకుంటున్నారు.మరోవైపు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అవినాష్ అనుచరులు కెమెరాలు,సెల్ ఫోన్లు లాక్కుని దౌర్జన్యం చేయడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు మీడియా ప్రతినిధులు. అయితే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.
Update: 2023-05-22 10:55 GMT