ఎంపీ అవినాశ్ అరెస్ట్ కు రంగంలోకి దిగిన సీబీఐ
ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ సమాయత్తం అయింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయని సమాచారం. కేంద్ర బలగాలు వచ్చాక సీబీఐ కర్నూలు ఆసుపత్రికి వెళ్లనుంది. ఈ మధ్యాహ్నానికి కేంద్రబలగాలు కర్నాలు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో స్థానిక పోలీసుల నుంచి సీబీఐకు ఎలాంటి సహకారం లభించడంలేదని తెలుస్తోంది.
Update: 2023-05-22 06:25 GMT