చీకటి పడ్డాకే అవినాష్ రెడ్డి అరెస్ట్
తీవ్ర విమర్శల నేపథ్యంలో వెనక్కు తగ్గుతున్న ఏపీ పోలీసులు. కేంద్ర బలగాలకు బదులుగా జిల్లా పోలీసు ఫోర్స్ తోనే బందోబస్తు కి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఆదోని,ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ల నుంచి పోలీస్ ఫోర్స్ ని కర్నూలుకు రప్పిస్తున్న అధికారులు. జిల్లా పోలీస్ ఫోర్స్ వచ్చాక.. కట్టుదిట్టమైన భద్రత నడుమ..హాస్పిటల్ కు సీబీఐ అధికారులు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీసులు వస్తే కట్టడి చేయలేక పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీకటి పడ్డాకే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Update: 2023-05-22 12:08 GMT