రైలు ప్రమాదం నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది

ఒడిశా రైలు దుర్ఘటన నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. పశ్చిమ్‌బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు ఘోర ప్రమాదానికి గురికావడంతో పెను విషాదం నింపింది. సుదీర్ఘ ప్రయాణం సాగించే రైలు కావడం, రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియడం లేదు. కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 238 మంది మృతి చెందడం, 800 మందికి పైగా గాయపడటంతో ప్రయాణికుల వివరాలు వెల్లడించడం కూడా రైల్వేశాఖ అధికారులకు కష్టతరంగా మారింది.


Update: 2023-06-03 05:03 GMT

Linked news