ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు
రైల్వే శాఖ అధికారులు ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల నుంచి నుంచి ఫోన్కాల్స్ వస్తున్నప్పటికీ అధికారులు.. గాయపడిన వివరాలు అందించలేని పరిస్థితి ఉంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైల్లో తమ రాష్ట్రానికి చెందిన వారు ఉండటంతో పశ్చిమ్బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని అధికారులతో మిగిలిన 3 రాష్ట్రాల అధికారులు సంప్రదిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
Update: 2023-06-03 05:04 GMT