సహాయ చర్యల్లో వైమానిక దళం

ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సహాయ చర్యల్లో వైమానిక దళం పాల్గొంటుంది. రెస్క్యూ,ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ కోసం ఎయిర్‌ఫోర్స్‌ సేవలు అందిస్తోంది. అంబులెన్సులు, వైద్యబృందాలు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ పలు జంక్షన్ల కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. గాయపడ్డ వారిని బాలాసోర్ మెడికల్ కాలేజీకి, సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Update: 2023-06-03 05:57 GMT

Linked news