సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్న అధికారులు

ఒడిశా రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు అధికారులు. 190మంది ప్రయాణికులతో బధ్రక్‌ నుంచి ప్రత్యేక ట్రైన్‌ చెన్నైకి బయల్దేరింది. కాసేపట్లో స్పెషల్ ట్రైన్ విశాఖ చేరుకోనుంది. ఇందులో ఏపీ ప్రజలు కూడా ఉన్నారు. ఉదయం 8గంటల 45 నిమిషాలకు8 బయల్దేరిన రైలు.. రాత్రి 9 గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు తెలిపారు. బరంపురంలో నలుగురు, విశాఖలో 41 మంది, రాజమండ్రిలో ఒక ప్రయాణికుడు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక తాడేపల్లిగూడెంలో ఇద్దరు, బెజవాడలో 9మంది, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగనున్నారు.

Update: 2023-06-03 09:50 GMT

Linked news