సౌత్ లో ది బెస్ట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఏ పాత్ర చేసినా అందులో అద్బుతమైన నటన చూపిస్తుంది. పైగా ఆయా భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకోవడం పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా తెలుగులో చేసిన మూవీస్ తో మాగ్జిమం తెలుగు అమ్మాయిగానే సెట్ అయింది. అలాంటి సాయి పల్లవికి బాలీవుడ్ మూవీ రామాయణ టీమ్ పెద్ద షాక్ ఇచ్చింది. అందుకు కారణం తన హిందీ డెబ్యూ మూవీ ఏక్ దిన్. ఏక్ దిన్ లో ఆమె నటన యావరేజ్ అని తేల్చారు. అంతకు మించి ఆమె చెప్పిన డబ్బింగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రధానంగా ఆమె హిందీ డబ్బింగ్ మాడ్యులేషన్ మరీ దారుణంగా ఉందని తేల్చారు చాలామంది. ఇదే విషయాన్ని ఆమె కూడా చెప్పింది. ఈ మూవీలో తన పాత్ర తనకు నచ్చలేదు అని, కేవలం ఆమిర్ ఖాన్ వల్లే ఈ మూవీ చేశానని.. ఇందులో తన పాత్ర తనకే నచ్చలేదు అని చెప్పింది. ఇవన్నీ రామాయణపై పెద్ద ప్రభావం చూపించింది.
ఏక్ దిన్ లో ఆమె డబ్బింగ్ మాడ్యులేషన్ దారుణంది కాబట్టి రామాయణ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఈ మూవీలో సీత పాత్రలో నటిస్తోంది కదా తను. ఇప్పుడు రామాయణ ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ చాలా వరకు అయింది. కాబట్టి ఆమెను తప్పించలేరు. అందుకే ఆమెకు రామాయణలో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్లానింగ్స్ సెట్ అయ్యాయి. అయితే ఓ సారి మాత్రం సాయి పల్లవితో డబ్బింగ్ ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయట. అప్పుడు ఆమె బాగా చెబితే ఓకే. లేదంటే వెంటనే వేరే వారితో హిందీ డబ్బింగ్ చెప్పించడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ మేటర్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఏక్ దిన్ వల్ల మాత్రం తనకు పెద్ద లాస్ జరిగిందనేది క్లియర్.