Shivam Dubey: ఐపీఎల్ మ్యాచ్ లో అతడిదే హవా.. ఎవరీ శివమ్ దూబే..

Shivam Dubey: ముంబైలో జన్మించిన శివమ్ దూబే ముంబై అండర్-23కి ఎంపికయ్యేందుకు కష్టపడ్డాడు.

Update: 2022-04-13 08:30 GMT

Shivam Dubey: మంగళవారం ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్‌లో 22వ మ్యాచ్‌లో శివమ్ దూబే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆల్ రౌండర్ 46 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 95 పరుగులతో అజేయంగా నిలిచాడు. దుబే కొట్టిన దెబ్బతో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తన పవర్-హిట్టింగ్ నైపుణ్యాలతో, దూబే ఆఖరి ఓవర్‌లో సిక్స్‌ను కూడా కొట్టాడు.

ముంబైలో జన్మించిన శివమ్ దూబే ముంబై అండర్-23కి ఎంపికయ్యేందుకు కష్టపడ్డాడు. 4 సంవత్సరాల వయస్సులో, శివమ్ తన ఫిట్‌నెస్ కోసం ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడ్డాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి విజయం సాధించాడు.. ఐపీఎల్ జట్టులో స్థానం సంపాదించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2015-16 సీజన్‌లో, శివమ్ T20 ద్వారా అరంగేట్రం చేసాడు. 2017-18లో రంజీ ట్రోఫీలో ఆడి ఐదు వికెట్లు సాధించాడు. 2018 రంజీ ట్రోఫీలో బరోడాపై ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. 23 వికెట్లతో, శివమ్ పేరు ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండియన్ T20 లీగ్ 2019 ఎడిషన్‌లో ప్రాతినిధ్యం వహించడానికి బెంగళూరు జట్టు నుండి ఒక ఒప్పందాన్ని అందుకున్నాడు.

2019 సంవత్సరం దూబేకి చాలా ప్రత్యేకం. జాతీయ జట్టుకు అరంగేట్రం చేసింది ఆ ఏడాదే. 2020లో, భారతదేశం న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా, శివమ్ ఒక ఓవర్‌లో 34 పరుగులు ఇవ్వడంతో అతని పేరు మీద రికార్డు నమోదైంది.

Tags:    

Similar News