ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కత్తా నైట్రైడర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 18 పరుగుల తేడాతో ఈ టోర్నీలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కత్తా నైట్రైడర్స్ 122 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.... నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.