Gautam Gambhir : గౌతమ్ గంభీర్కి కరోనా పాజిటివ్..!
Gautam Gambhir : ఇండియన్ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు.;
Gautam Gambhir : ఇండియన్ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, తనని కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అంతేకాకుండా ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపాడు. 2022 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్గా వ్యవహరించనున్నాడు గంభీర్. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2022వేలంపాట ప్రారభం కానుంది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ తరుపునఆడిన గౌతమ్ గంభీర్ రెండుసార్లు ఆ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022