ఈసారి వేలంలో భారీగానే ధర పలికిన శివమ్ దూబె..!
గతేడాది కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.;
భారత యువ ఆల్రౌండర్ శివమ్ దూబెకు ఈ సారి భారీగానే డిమాండ్ పెరిగింది. గతేడాది కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈసారి అతన్నీ రాజస్థాన్ జట్టు రూ.4.4కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. రూ.50 లక్షల బేస్ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన అతన్ని ఏకంగా రూ.4.4 కోట్లకు కొనుగోలు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.