సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు!

ఛాతీలో నొప్పితో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గతంలో వేసిన ఓ స్టంట్‌కు తోడుగా ఇప్పుడు మరో రెండు స్టంట్లు వేశారు.

Update: 2021-01-28 14:00 GMT

ఛాతీలో నొప్పితో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గతంలో వేసిన ఓ స్టంట్‌కు తోడుగా ఇప్పుడు మరో రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం దాదా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు గంగూలీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వచ్చారు. కాగా జనవరి మొదటి వారంలో గంగూలీకి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టెంట్‌ అమర్చారు. బుధవారం కాస్త అసౌకర్యంగా ఉండటంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు. 

Tags:    

Similar News