T20 World Cup: కంగ్రాట్స్ న్యూజిలాండ్.. బైబై టీమిండియా..
T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో ఇండియా విజయంపై టీమ్ ఎప్పుడో నీళ్లు చల్లేసింది.;
T20 World Cup (tv5news.in)
T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో ఇండియా విజయంపై టీమ్ ఎప్పుడో నీళ్లు చల్లేసింది. కానీ మొన్న ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టాప్ ప్లేయర్స్ అందరూ మళ్లీ ఫార్మ్లోకి రావడంతో ఎక్కడో చిన్న ఆశ టీమిండియా అభిమానుల్లో చిగురించింది. మళ్లీ ఈరోజు ఆ కలలు నెరవేరవని తేలిపోయింది. ఈరోజు టీ20 వరల్డ్ కప్లో ఆఫ్గనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తేనే టీమిండియా సెమీస్కు వెళ్లే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ముందు ఆఫ్గనిస్తాన్ గెలవదని తెలిసినా.. ఎక్కడో టీమిండియా ఫ్యాన్స్కు ఒక్క అద్భుతం జరగకపోదా అన్న ఆశలు ఉన్నాయి. కానీ ఏ అద్భుతం టీమిండియాను కాపాడలేకపోయింది. చాలామంది ఊహించినట్టుగానే న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయింది. దీంతో సెమీస్కు ఇండియా వెళ్లే ఛాన్స్ను మిస్ అయ్యింది.
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ అది టీమ్ ఫ్యూచర్ను ఏ మాత్రం డిసైడ్ చేసేది కాదు. నమీబియాతో మ్యాచ్ ఇంకా మిగిలున్నా అది సెమీస్పై ఏ మాత్రం ప్రభావం చూపించదు. అందుకే ఇండియన్ క్రికెట్ లవర్స్ అంతా ఇప్పటికే మ్యాచ్ విషయాన్ని పక్కన పెట్టి టీ20 వరల్డ్ కప్ గురించి పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారి పాకిస్థాన్ సెమీస్కు చేరుకున్నందుకు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.