Bangalore: భార్యాభర్తల మధ్య సాంబార్ గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భార్య..

గురువారం తన భర్తతో జరిగిన గొడవ తర్వాత కావ్య అనే మహిళ పురుగుమందు తాగిందని ఆరోపించారు.

Update: 2026-03-07 10:38 GMT

మూడు రోజుల నుంచి అదే సాంబారు వేడి చేసి వడ్డిస్తున్న భార్య మీద కేకలు వేశాడు భర్త.. ఇద్దరి మద్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఆవేశంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.  చిన్న గొడవ చినికి చినికి గాలి వాన అయింది. ఇంట్లో జరిగిన వివాదం 27 ఏళ్ల మహిళ మృతికి కారణమైంది. గురువారం తన భర్తతో జరిగిన గొడవ తర్వాత కావ్య అనే మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఆరోపించారు.

కావ్య రంగస్వామిని ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. వారికి నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మూడు రోజుల క్రితం తయారుచేసిన సాంబార్‌ను ఆమె మళ్లీ వేడి చేసి వడ్డించడంతో గొడవ మొదలైంది. 

ఆ చర్చ తీవ్ర వాగ్వివాదానికి దారితీసిందని, ఆ సమయంలో భర్త ఆమెను మాటలతో దుర్భాషలాడాడని, ఆమెపై దాడికి ప్రయత్నించాడని చెబుతున్నారు. ఘర్షణ తర్వాత, కావ్య పొలంలో ఉపయోగించే పురుగుమందును సేవించింది. అనంతరం ఆమె వాంతులు చేసుకోవడంతో అనారోగ్యంతో ఉందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే మరణించిందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Tags:    

Similar News