మరోసారి తెరపైకి ఈఎస్ఐ కుంభకోణం
ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.;
ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఉదయం నుంచి దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. మరోవైపు నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుంద రెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపడుతోంది.