పెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ.. SBIలో రూ.18.40లక్షల నగదుతో పాటు, 6 కిలోల బంగారం అపహరణ..!
పెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంథని మండలం గుంజపడుగులోని ఎస్బీఐలో 18 లక్షల 40వేల నగదుతో పాటు, 6 కిలోల బంగారం దోచుకెళ్లారు.;
పెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంథని మండలం గుంజపడుగులోని ఎస్బీఐలో 18 లక్షల 40వేల నగదుతో పాటు, 6 కిలోల బంగారం దోచుకెళ్లారు. వీటి మొత్తం విలువ 3 కోట్ల 10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా ప్లాన్తో చోరీ జరిగినట్లు గుర్తించారు. సీసీ కెమెరా డీవీఆర్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు 8 బృందాలను రంగంలోకి దించినట్లు రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.