మాట్రిమోనియల్ పరిచయం, పెళ్లి పేరిట మోసం... బాధితురాలికి టోకరా

నగలు, డెబిట్ కార్డ్, నగదుతో సహా ఉడాయించిన దుండగుడు

Update: 2023-05-10 09:28 GMT

ఓ విమానయాన సంస్థలో పనిచేసే మహిళను మోసం చేసి ఆమె నగలను, ధనాన్ని, డెబిట్ కార్డులను ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. బెంగళూరుకు చెందిన బాధితురాలు వివాహం కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను ఉంచింది. అందులోనే ఢిల్లీకి చెందిన అన్షుల్ జైన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మూడు రోజుల క్రితం అన్షుల్ తన కుటుంబానికి పరిచయం చేస్తానని ఆమెను ఢిల్లీకి పిలిచాడు. తల్లిదండ్రుల ముందు గ్రాండ్ గా కనిపించేందుకు నగలను తీసుకురావాలని చెప్పాడు. ఇదే విధంగా కొన్ని నగలు, నగదుతో ఢిల్లీ వెళ్లిన బాధితురాలిని ఎయర్ పోర్ట్ లో రీసీవ్ చేసుకున్న అన్షుల్ మార్గం మధ్యలో కారులో టైరులో ఏదో లోపం ఉందని, దిగి చూడాల్సిందిగా ఆమెకు సూచించాడు. ఆ ప్రకారమే కారు దిగిన బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోడు. దీంతో తాను మోసపోయానని నిర్ధారించుకున్న ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Tags: