ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారం చేసి ప్రైవేట్ పార్ట్స్లో రాళ్లు, సర్జికల్ బ్లేడ్
వసాయ్ బీచ్లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ మహిళ రైల్వే స్టేషన్కు చేరుకుని పోలీసులను ఆశ్రయించింది.;
ఒంటరిగా ఉన్న మహిళ కనిపిస్తే చాలు, అందరి కళ్లు ఆమె పైనే.. అదీ అర్ధరాత్రి అయితే ఆమెకు రక్షణ ఎక్కడ ఉంటుంది. కామంతో మూసుకుపోయిన కళ్లు తమ చుట్టూనే ఉంటాయన్న గ్రహింపు లేకుండా ఆమె ఒక్కతే అక్కడ ఉంది. ఆటో డ్రైవర్ కళ్లు ఆమె మీద పడ్డాయి.
20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్లలో సర్జికల్ బ్లేడ్తో పాటు రాళ్లను అమర్చిన ఓ ఆటోరిక్షా డ్రైవర్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్లోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. ఆ రోజు ముందు రైలులో ముంబైకి వెళ్లినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
వసాయ్ బీచ్లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత మహిళ రైల్వే స్టేషన్కు చేరుకుని, ఆటో డ్రైవర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అధికారులను సంప్రదించింది.
మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్ మరియు రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యుల సంరక్షణలో ఆమె చికిత్స పొందుతోంది.
ఆమె ఫిర్యాదు మేరకు ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.