భార్యతో వ్యాపార గొడవలు.. కేఫ్ ఓనర్ ఆత్మహత్య
పునీత్ ఖురానా, అతని భార్య మాణికా జగదీష్ పహ్వా విడాకులు తీసుకునే దశలో ఉన్నారు. వీరు ఢిల్లీలో వుడ్బాక్స్ కేఫ్ను నడుపుతున్నారు.;
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో 40 ఏళ్ల వ్యక్తి శవమై కనిపించాడు, పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ ప్రముఖ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా మోడల్ టౌన్లోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు.
ఖురానా మరియు అతని భార్య మాణికా జగదీష్ పహ్వా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దేశ రాజధానిలో వుడ్బాక్స్ కేఫ్ను కలిగి ఉన్న వీరిద్దరికీ వ్యాపారం వివాదం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఖురానా కుటుంబం ప్రకారం వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులు బావున్నారు. కానీ అనంతరం వీరి మద్య గొడవలు చోటు చేసుకున్నాయి.
నా బకాయిలను మీరు క్లియర్ చేయాలి" అని ఖురానా భార్య కాల్లో చెప్పింది. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఖురానా ఫోన్ను స్వాధీనం చేసుకుని అతని భార్యను విచారణ కోసం పిలిచారు. ఇటీవల బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది.