India corona Update : కేసులు తగ్గాయి.. మరణాలు పెరిగాయి..!
India corona Update : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 40,120 కేసులు వెలుగుచూశాయి.
India corona Update : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 40,120 కేసులు వెలుగుచూశాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 585 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లు దాటగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,30,254కి చేరింది. అటు నిన్న 42వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో ఇప్పటివరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3.13 కోట్లుగా చేరింది. ప్రస్తుతం 3,84,227 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.