జనవరి నుంచి కరెంట్ ఫ్రీ..
ప్రతి నెలా 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ను సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఇవ్వడానికి ఓ ప్రతిపాదన సిద్దమైంది.;
నూతన సంవత్సరం జనవరి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కమ్లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నాయి. డిసెంబరు నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లు/లాండ్రీలకు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయనున్నట్లు టీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. ప్రతి నెలా 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ను సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఇవ్వడానికి ఓ ప్రతిపాదన సిద్దమైంది. తాజాగా సెలూన్లు ఎంత మేర విద్యుత్ను వినియోగిస్తున్నాయో వివరాలు సేకరించారు.
ఇప్పటికే 24 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తుండగా.. 101 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నారు. ఇప్పుడు క్షురకులు, రజకులు కూడా ఈ జాబితాలో చేరనున్నారు.