Mangaluru: కోడికూరపై రగడ; కొడుకుని కొట్టి చంపిన తండ్రి

కోడికూర తినేశాడని తండ్రిపై చిందులు తొక్కిన కొడుకు; కోపంతో కొడుకును కొట్టి చంపేసిన తండ్రి

Update: 2023-04-06 07:44 GMT

కోడి కూరపై ఇంట్లో చెలరేగిన రగడ ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.  గుత్తిగర్ కు చెందిన శివకుమార్ ఇంట్లో వండిన కోడి కూర తనకు కనీసం రుచి చూపించకుండా తండ్రే తినేశాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తండ్రి కొడుకుపై పద్ద కర్రతో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమార్ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News