త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోనుంది. మేఘాలయలో మాత్రం హంగ్ ఏర్పడనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపురలో 60 స్థానాలకు గాను బీజేపీ 33 స్థానాల్లో లీడ్ లో ఉంది. 15 స్థానాల్లో లెఫ్ట్, 11 స్థానాల్లో టీఎమ్టీ లీడ్ లో ఉన్నాయి.
నాగాలాండ్ లో 59 స్థానాలకుగాను, ఎన్డీపీపీ, బీజేపీ కూటమి 35 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎన్పీఎఫ్ 2, కాంగ్రెస్ 2, ఇతరులు 19 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. మేఘాలయాలో ఎన్పీపీ 27 స్థానాల్లో, బీజేపీ 5, కాంగ్రెస్ 5, ఇతరులు 22 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 31 స్థానాలు గెలవాల్సి ఉంది.