ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది పరిస్థితి విషమం

Update: 2020-12-14 11:29 GMT

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలహండి నుంచి హైదరాబాద్​ వస్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్‌సొర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News