SBI Customers Beware: కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక.. ఆ 4 యాప్లను ఇన్స్టాల్ చేసుకోవద్దు..
దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.;
దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా ఏదైనా యాప్ వస్తే దాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటూ పదే పదే మీ ఫోన్కు మెసేజ్లు వస్తుంటాయి. అయితే పొరపాటున కూడా ఈ 4 యాప్లు డౌన్ లోడ్ చేసుకోవద్దంటుంది. ఆ యాప్లు ఎనీడెస్క్, క్విక్సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్వ్యూ యాప్లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని తన వినియోగదార్లకు బ్యాంకు సూచించింది. ఈ నాలుగు యాప్లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ యాప్లను డౌన్ లోడ్ చేసుకోమని కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్లు చెప్పిన మాటలు విని ఆ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల గత నాలుగు నెలల్లో 150 మంది ఎస్బీఐ వినియోగదార్లు మొత్తంగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నారని ఎస్బీఐ తెలిపింది. ఈ తరహా కేసులు పెరిగిపోతుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 యాప్లను ఇన్స్టాల్ చేసుకోవద్దని ఖాతాదార్లకు ఎస్బీఐ సూచించింది.
యూపీఐ ప్లాట్ఫాంలను ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మీకు తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది. ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని అలాంటి వాటికి జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. ఏ సమస్య పరిష్కారం కోసమైనా తమ అధికారిక వెబ్సైట్ సరైనదే అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే మీ వివరాలు తెలియజేయండని ఖాతాదార్లకు ఎస్బీఐ తెలిపింది.
డిజిటల్ లావాదేవీ పూర్తయ్యాక వినియోగదారుకి ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది.. ఒకవేళ ఆ లావాదేవీ వాళ్లు నిర్వహించకుంటే వెంటనే ఆ ఎస్ఎమ్ఎస్లోని నెంబరుకు ఆ ఎస్ఎమ్ఎస్లోని నెంబరుకు ఆ మెసేజ్ను తిరిగి పంపించాలని పేర్కొంది. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1800111109, 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లలో ఎస్బీఐ ఖాతాదార్లు సంప్రదిచవచ్చని ఎస్బీఐ తెలిపింది. అలాగే 155620 నెంబరును ఉపయోగించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఫోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని వివరించింది.