15 ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడెలా దొరికింది.. ఆమె షాక్
పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడ్డానని, కొన్ని రోజులకు ఇక దొరకదని భావించి మర్చిపోయానన్నారామె.;
ఏదైనా వస్తువు ఇంట్లో పోయినా, వీధిలో పోయినా దొరుకుతుందేమో కానీ జనసంధ్రం ఎక్కువగా ఉండే రైల్లో పోతే ఎలా దొరుకుతుంది. ఆశ్చర్యంగా 2005లో పోగొట్టుకున్న ఆ లాకెట్2021లో దొరికింది. సరిగ్గా పదిహేనేళ్ల తరువాత దొరికన తన గణేష్ లాకెట్ను చూసుకుని సంభ్రమాశ్చర్యానికి గురైంది.
2005 లో సబర్బన్ రైలు ప్రయాణంలో ఒక థానే మహిళ గణేష్ చిత్రంతో ఉన్న బంగారు లాకెట్ను పోగొట్టుకుంది. దీని బరువు 5.80 మిల్లీగ్రాములు, ఆ సమయంలో దాని విలువ కేవలం 400 రూపాయలు, మరియు దాని విలువ రూ .25 వేలు. అది తన సెంటిమెంట్ లాకెట్ అని, దాన్ని పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడ్డానని, కొన్ని రోజులకు ఇక దొరకదని భావించి మర్చిపోయానన్నారామె.
"న్యూ ఇయర్ సందర్భంగా, రేష్మా అమృతే పోగొట్టుకున్న గణేష్ లాకెట్ను ఆమెకు ఇవ్వాలనుకున్నాము. నిజానికి ఏడాది క్రితమే ఈ లాకెట్ దొరికినా ఆమెని పట్టుకోవడం మాకు సాధ్యం కాలేదు. ఆధార్ కార్డ్ ద్వారా ఆమె వివరాలు సేకరించి ఆమె సెంటిమెంట్ అయిన లాకెట్ను తిరిగి ఇవ్వగలిగాము అని థానే రైల్వే పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్జి ఖాడ్కికర్ తెలిపారు.