Yogi Adityanath : వారిపై దేశద్రోహం కేసులు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్..!

Yogi Adityanath : తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పై పాక్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే..

Update: 2021-10-29 03:09 GMT

Yogi Adityanath : తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పై పాక్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.. పాక్ విజయం సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్న వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపైన దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. బుధవారం ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన లింక్ ని తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. సీఎం తాజా ఆదేశాలతో ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్‌, సీతాపూర్‌ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు యూపీ పోలీసులు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్‌) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. 



Tags:    

Similar News